తెలంగామ,హైదరాబాద్, మే 8 -- Telangana Group-I Officers Association : గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియమించే పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం పేర్కొంది. వీటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రతిపాదనలు అందించాలని పీఆర్సీ కమిటీకి లేఖను అందజేసింది.

బుధవారం తెలంగాణ గ్రూప్ - 1 అధికారుల సంఘం ప్రతినిధులు పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ శ్రీ శివ శంకర్ ను కలిసి విజ్ఞప్తి అందజేశారు. గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్ సివిల్ సర్వీస్ గా గ్రూప్ 1 సర్వీస్ లోని పోస్టులను పరిగణించడంతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా గ్రూప్ 1 అధికారులను నియమించే సిఫార్సులు చేయాలని లేఖలో ప్రస్తావించారు. కాలానుగుణంగా పదోన్నతులు ఇచ్చేలా చూడాలని కోరారు.

సీపీఎస్ వ...