భారతదేశం, ఏప్రిల్ 25 -- Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిక్కుల్లో ప‌డ్డ‌ది. ఐపీఎల్ 2024 ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్ కేసులో త‌మ‌న్నాకు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు.

ఐపీఎల్ 2025 స్ట్రీమింగ్ రైట్స్ 23 758 కోట్ల‌కు వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద‌క్కించుకున్న‌ది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హ‌క్కులు వ‌యాకామ్ త‌ప్ప మ‌రో సంస్థ‌కు లేవు. కానీ ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ త‌మ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఫెయిర్ ప్లే బెట్టింగ్‌ యాప్ వ‌ల్ల త‌మ‌కు భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌తినిధులు ఫిర్యాదుచేశారు.

ఈ ఐపీఎల్ ఇల్లీగ‌ల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఫెయిర్ ప్లే యాప్‌ నిర్వ‌హ‌కుల‌తో పాటు త‌మ‌న్నాకు కూడా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల...