భారతదేశం, మార్చి 4 -- Online Betting : జూదం ఆట మహా భారత సంగ్రామానికి కారణమైన విషయం తెలిసిందే. ధర్మరాజును వ్యూహాత్మకంగా దెబ్బతీసి అడవులపాలు చేసిన ఉదంతాన్ని మహా భారత గాధలో మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మన వాళ్లు ఆడే నయా జూదం ఆటలో ఓడిన వారు అడవులపాలు కాదు.. ఏకంగా తమ జీవితాలనే ఛిద్రం చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇది ఎదురుపడి ఆడే ఆట కానేకాదు. ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ లేదు. కానీ బ్యాంకు ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది. ఈ ఆట దెబ్బకు సర్వస్వం కోల్పోయిన ధర్మరాజులూ లేకపోలేదు. "కాయ్ రాజా కాయ్" అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ (Onlie betting)వేదికగా జడలు విప్పాయి. మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి దివాళా తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆటో, నేన...