భారతదేశం, మే 8 -- Medak Deaths: ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా, నీటి వనరులలోకి దిగటం వల్ల ప్రమాదాలు బారిన పడుతున్న ఘటనలు మెదక్‌లో తరచూ జరుగుతున్నాయి. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూరు (డి) గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు (డి) గ్రామానికి చెందిన ఎలబంటి శివయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు. కాగా మూడవ కొడుకు వినోద్ కుమార్ (23) ఇంటర్ వరకు చదువుకొని, కూలి పనులు చేసుకుంటూ జీవనం తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

ఆదివారం వినోద్ తన స్నేహితులతో కలిసి కొత్తూరు గ్రామ శివారులోని మైనింగ్ స్వారీ సమీపానికి విందు చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేశాక ఎండ వేడిమి నుండి సేదతీరేందుకు ఇద్దరు క్వారీ గుంతలోకి దిగారు.

ఈ క...