భారతదేశం, మే 4 -- Guppedantha Manasu Serial: మ‌నును జైలుకు పంపించేందుకు తాను బ‌తికే ఉన్నా చ‌నిపోయిన‌ట్లు శైలేంద్ర‌తో క‌లిసి రాజీవ్ నాట‌కం ఆడుతాడు. మ‌నుకు రాజీవ్ క‌నిపిస్తాడు. రాజీవ్ బ‌తికే ఉన్నాడ‌ని మ‌ను ఎంత చెప్పిన పోలీసులు క‌ట్టుక‌థ‌గా అత‌డి మాట‌ల‌ను కొట్టిప‌డేస్తారు.పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న మ‌నును రాజీవ్ క‌లిసిన విష‌యం తెలిసి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు.

కొద్ది రోజులు వ‌సుధార‌తో పాటు ఎవ‌రికి క‌నిపించ‌కుండా దూరంగా ఉండ‌మ‌ని రాజీవ్‌ను రిక్వెస్ట్ చేస్తాడు. త‌న మ‌ర‌ద‌ల‌ని చూడ‌కుండా ఉండ‌లేన‌ని, ఒక‌వేళ తాను నిజంగా చ‌నిపోయిన వ‌సుధార కోసం ద‌య్య‌మై వ‌స్తాన‌ని శైలేంద్ర‌కు బ‌దులిస్తాడు రాజీవ్‌. మ‌ను గుండెల్లో ద‌డ‌పుట్టించి భ‌య‌పెట్ట‌డానికే తాను పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాన‌ని, త‌న‌కు, త‌న మ‌ర‌ద‌లు వ‌సుధార‌కు అడ్డుగోడ‌గా నిలిచి చిన్న చిన్న ఆనందాలు కూడా ...