భారతదేశం, ఏప్రిల్ 20 -- Elon Musk India visit : దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లాని ఇండియాలోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లలో భారీ కుదుపు! ఇండియా ట్రిప్​ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

"దురదృష్టవశాత్తు, టెస్లాకు సంబంధించిన భారీ బాధ్యతల కారణంగా భారత దేశ పర్యటన ఆలస్యం అవుతోంది. కానీ ఈ సంవత్సరం చివరిలోపు ఇండియాను సందర్శించడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మస్క్.. ఏప్రిల్ 20న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్​ (ట్విట్టర్​)లో ఒక పోస్ట్​ పెట్టారు.

భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఎదురుచూస్తున్నానని ఇదే ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా.. కొన్ని రోజుల క్రితమే (ఏప్రిల్ 10, 2024) ఎలాన్ మస్క్ తెలిపారు. ఫలితంగా.. టెస్లా చుట్టూ హైప్​...