భారతదేశం, ఏప్రిల్ 29 -- CM Revanth Reddy On Notices : దిల్లీ పోలీసులు నోటీసుల(Delhi Police Notices)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy on Notices) స్పందించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకు అమిత్ షా నోటీసులు పంపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా(Social Media)లో బీజేపీని ప్రశ్నించినందుకు అమిత్ షా తనకు, గాంధీభవన్‌కు నోటీసులు పంపారని విమర్శించారు. కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి సహకరించాలని కోరారు. కర్ణాటక(Karnataka) రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ కర్ణాటకకు ఇచ్చింద...