భారతదేశం, ఏప్రిల్ 30 -- Changes from May 1 2024 : మే 1 నుంచి పలు ఆర్థికపరమైన విషయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. యెస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలు తమ పొదుపు ఖాతా ఛార్జీలు, క్రెడిట్ కార్డు నిబంధనల్ మే 1 నుంచి మార్పులు చేయనున్నాయి. ఇదిలా ఉంటే, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎఫ్​డీ మే 10 తో ముగియనుంది. వచ్చే నెల నుంచి మిమ్మల్ని ప్రభావితం చేసే అన్ని ఫైనాన్షియల్ అప్​డేట్స్​ని ఇక్క తెలుసుకోండి..

ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవల చెక్ బుక్ జారీ, ఐఎంపీఎస్, ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు సహా వివిధ సేవలకు సర్వీస్ ఛార్జీలను సవరించింది. ఈ అప్​డేట్స్​ మే 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్​సైట్​లో ఉంది. ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే మీరు షాక్​ అవ్వాల్సిన పని ఉండదు.

Money chang...